కావలసిన వస్తువులు:
పండుమిర్చి తురుము : 1/2 కప్పు
చింతపండు : చిన్న నిమ్మకాయంత
పాలకూర : 1 కప్పు
జీలకర్ర : 1/2 టీ స్పూను
ఆవాలు : 1/4 టీ స్పూను
ధనియాలు :1 టీ స్పూను
కరివేపాకు : 1 రెమ్మ
ఉప్పు : తగినంత
నూనె : 4 టీ స్పూను
తయారీచేసేవిధానం :
ప్యాన్లో రెండు చెంచాల నూనె వేడి చేసి సన్నగా తరిగిన పండుమిర్చి ముక్కలు, పాలకూర, సగం జీలకర్ర, ధనియాలు దోరగా వేయించుకొవాలి. ఇందులో తగినంత ఉప్పు, నారతీసిన చింతపండు వేసి మెత్తగా రుబ్బుకోవాలి. మిగిలిన నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక కరివేపాకు వేసి కొద్దిగా వేయించి రుబ్బుకున్న పచ్చడిలో కలపాలి. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి కలుపుకుని తింటే చాలా బావుంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: